దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నందున సెల్ ఫోన్ వినియోగ దారులకు అంతరాయం లేని సేవలు అందించాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లకు సూచించింది. ఇందులో భాగంగా ప్రీ పెయిడ్ చందా దారుల ప్రస్తుత పథకాల కాల పరిమితి (వాలిడిటీ) ని పెంచాలని సూచించింది.
‘లాక్ డౌన్ సమయంలో మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రీ పెయిడ్ చందాదారులకు అంతరాయం కలగకుండా ప్రస్తుత పథకాల కాల పరిమితి ని పెంచడం అందులో ఒకటి’ అని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ‘టెలికాంను అత్యవసర సేవలుగా గుర్తించి మినహాయింపు ఇచ్చినప్పటికీ వినియోగదారుల సేవా కేంద్రాలపై లాక్ డౌన్ ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ పెయిడ్ వినియోగదారులకు వోచర్లు, టాపప్ లు దొరకడం కష్టం. అంతరాయం లేకుండా వారు టెలికాం సేవలు పొందేందుకు ప్రస్తుత పథకాల కాల పరిమితి పెంచాలి’ అని ట్రాయ్ తెలిపింది.