మహబూబ్ నగర్ లోని వెంకటేశ్వర కాలనికి చెందిన అక్క చెల్లెళ్లు హెచ్.వి.పద్మావతి (విశ్రాంత అధ్యాపకులు), హెచ్.వి. సరోజ ( విశ్రాంత ప్రిన్సిపాల్)లు కరోనా నియంత్రణ కు లక్ష రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు కు అందజేశారు. రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్లు అయి న పద్మావతి, సరోజలు రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు తో కలిసి కలెక్టర్ కు విరాళం గా అందజేశారు.
పద్మావతి తనకు వచ్చే పెన్షన్ 70000 రూపాయులు, సరోజ తన వంతుగా 30000వేల రూపాయలను విరాళంగా ప్రకటించి కరోనా నియంత్రణ కు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కు వెచ్చించాలని కోరగా అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించడం తో పాటు తన నిధుల నుంచి మరో లక్ష రూపాయలు ప్రకటించారు.
మొత్తం రెండు లక్షలను పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. గతంలో కూడా అక్క చెల్లెళ్లు కేరళ వరద బాధితులకు తమ వంతుగా లక్ష రూపాయల ను ప్రకటించి సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.