సరిహద్దుల వద్ద భారత్ తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున స్థానికులతో కలిసి ఆ ముప్పును ఎదుర్కొనాలని పాకిస్తాన్ సైన్యానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఆదేశాలిచ్చారు.
భారత్ తరచూ కాల్పులకు దిగుతున్నందున ఆజాద్ కాశ్మీర్ లోని సాధారణ పౌరులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.
అందువల్ల పౌరులతో కలిసి పాకిస్తాన్ సైన్యం భారత్ దాడులను తిప్పి కొట్టాలని ఆయన ఆదేశించారు.
సరిహద్దుల వద్ద భారత్ తరచూ కాల్పులకు తెగబడటం వల్ల ఎంతో మంది పౌరులకు నష్టం వాటిల్లుతున్నదని ఆయన అన్నారు.
సరిహద్దుల్లో ఎంతో అప్రమత్తంగా ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని ఆయన అభినందించారు.