ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలైన జట్టుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రోఫీ నీ అందజేశారు.బంజారా యూత్ అధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలైన ఎన్బికే టీం కు ట్రోఫీని అందజేసి టీమ్ ను అభినందించారు. ఇలాంటి టోర్నమెంట్స్ మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు మద్దినేని వెంకట రమణ, వీరు నాయక్, మందడపు నర్సింహ రావు తదితరులు ఉన్నారు.