40.2 C
Hyderabad
May 5, 2024 15: 29 PM
Slider విజయనగరం

రాష్ట్ర పతి ,ప్రధాని కన్నా. సీఎం జగన్ ఎక్కవా…!

#bjp

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో…ప్రప్రధమ పౌరురాలు రాష్ట్ర పతి ఫోటో.. ప్రధాని ఫోటోలు పెట్టాలని విజయనగరం జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్ కు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో విలేకరులతో బీజేపీ నేత కుసుమంచి సుబ్బారావు, సుధీర్ లు మాట్లాడుతూ…. ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం జగన్ ఫోటో తో పాటు ప్రధాని మోడీ, రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఫోటోలను పెట్టాలని కోరారు.

దేశానికి ఓ దళిత జాతికి చెందిన మహిళ ను రాష్ట్ర పతిగా నియమించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ నేత కుసుమంచి సుబ్బారావు అన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్న విషయాన్ని సీఎం జగన్ ప్రభుత్వం దాస్తోందన్నారు. ఓ నిమ్న జాతికి చెందిన ఓ మహిళను రాష్ట్ర పతిగా చేసిన ప్రధాని మోడీ ఫోటో ను కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో జగన్ ప్రభుత్వం ఎందుకు పెట్టడః లేదని కుసుమంచి ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర పతి ముర్ము ఫోటో ను పెట్టకుండా… అధికార మదంతో..కేవలం సీఎం జగన్ ఫోటో మాత్రమే పెట్టడం సబబు కాదన్నారు. తక్షణమే రాష్ట్ర పతి, ప్రధాని ల ఫోటోలను..ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Related posts

కొండరాళ్లు విరిగిపడుతున్న ఇంద్రకిలాద్రి కొండ

Satyam NEWS

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

Satyam NEWS

ఉత్తర దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం

Satyam NEWS

Leave a Comment