ఇటీవలే ఏపీ రాష్ట్రంలో 72 మంది డీఎస్పీ లకు నియమిస్తూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసు శాఖ…డీజీపీ ఆదేశాలతో ఉత్తర్వులు ఇస్తే తాజాగా ఒకే సారి వెయింటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ లకు..పోస్టింగ్ లు కేటాయిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ నుంచీ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే సంబంధిత డీఎస్పీ లు విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశాలిచ్చారు.
అయితే ఇటీవలే విజయనగరం “దిశ” డీఎస్పీ వేంకటేశ్వర్లు ను బదిలీ చేస్తూ కాళిదాసు ను వేయడం అలాగే బొబ్బిలి కి కూడా వేరే డీఎస్పీ ని వేసిన రాష్ట్ర పోలీసు శాఖ…తాజాగా ఆ రెండు పోస్ట్ లలో ఇద్దరినీ మార్చి..”దిశ” డీఎస్పీ గా గోవింద రావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వెయిటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ లను వేస్తూ తక్షణమే విధుల్లో చేరాలని… రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.అయితే రాష్ట్రంలో వచ్చే ఏడాది లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో… రెండు దఫాలుగా 120 మంది డీఎస్పీ లకు పోస్టింగ్ ఇవ్వడంతో… ఆసక్తి కరమైన చర్చలు జరుగుతున్నాయని అంటోంది…
“సత్యం న్యూస్. నెట్.”.