ప్రైవేటు పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వివిధ జిల్లాల పాఠశాలల కరస్పాండెంట్ లు కడప జిల్లా ఇడుపులపాయ వద్ద చేపట్టిన జల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ఏపీ జేఏసీ చైర్మన్ లెక్కల జోగి రామి రెడ్డి, ప్రవీణ్, రామాంజనేయరెడ్డి, పుల్లపు నాయుడు మరో 30మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా వారు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ పర్యటన సందర్భంగా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. జల దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వేంపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అరెస్టులకు భయపడేది లేదని వారు తెలిపారు.