ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వినుకొండ విశ్వకుమార్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ను మర్యాద పూర్వకంగా కలిసి వారు చేస్తున్న సంఘ సేవా కార్యక్రమాలు వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కరోనా కారణంగా పాఠశాలలు మూత పడి ప్రైవేట్ టీచర్స్ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని, తమ వంతు సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల శంకరయ్య, ముప్పు పూర్ణేందర్ లావుడ్య రాజు ప్రధాన కార్యదర్శి గొట్టెముక్కుల రాకేష్ ప్రచార కార్యదర్శి గుగ్గిళ్ళ సుజన్ సభ్యులు జనార్థన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.