భారత క్రీడాభిమానులకు మరొక శుభవార్త.
టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిప్టింగ్లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన మరుసటి రోజే.. ప్రియా మాలిక్ ప్రపంచ స్థాయి టైటిల్ నెగ్గింది.
భారత రెజ్లర్ ప్రియా మాలిక్ రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది.
స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్ అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది.
హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది.