Slider వరంగల్

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

#mulugua

ములుగు పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నేడు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ అన్నవరం మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త గా, తెలంగాణ జాతిపిత గా గుర్తింపు పొందిన  ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొలి, మలిదశ తెలంగాణా ఉద్యమం లో ప్రధాన పాత్ర పోషించారు అని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకతను సమాజానికి చాటి చెప్పిన వ్యక్తి జయశంకర్ సార్ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణా ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ, జర్నలిస్ట్ ల సంఘం నాయకులు మాట్ల సంపత్, ఆర్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవీందర్, DYFI నాయకులు కల్వల రవీందర్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్. పుల్లయ్య,   కాకి రవిపాల్ తదితరులు పాల్గొన్నారు. 

Related posts

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కొరడా

Satyam NEWS

పూలబాట: పుత్తూరులో రోజా తక్కెళ్లపాడులో సుచరిత

Satyam NEWS

ఈసారి సరికొత్తగా:మళ్ళీ మార్కెట్ లోకి బజాజ్ చేతక్

Satyam NEWS

Leave a Comment