గత 36 సంవత్సరాలు గా సిబిఐటి కళాశాల లో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ ఎం వి ఎస్ మురళి కృష్ణ ఈ రోజు పదవి విరమణ చేసారు. ఈ సందర్బం గా కళాశాల ప్రిన్సిపాల్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మురళి ఎంతో అంకితభావంతో కష్టపడి పని చేసేవారని తెలిపారు. ఆయన థర్మల్ ఇంజనీరింగ్ లో ఎన్నో పరిశోధన చేసారని కొనియాడారు.
విభాగధిపతి ప్రొఫెసర్ పి వి ఆర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మురళి సిబిఐటి కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి గా 19-10-2018 నుండి 31-05-2020 వరకు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి లో ఆయన మొత్తం 263 పరిశోధన ప్రచురణలు వున్నాయని వివరించారు. 3 పేటెంట్ లు ఆయన పేరున వున్నాయి. ప్రొఫెసర్ మురళి ఎంతో మంది విద్యార్థులకు ఇష్టమైన ఉపాధ్యాయుడు అని అన్నారు.
ప్రొఫెసర్ వై రామ దేవి, ప్రొఫెసర్ పబ్బోజి సురేష్, సూర్యనారాయణ మురళి ప్రతిభను కొనియాడారు. ప్రొఫెసర్ జి కృష్ణ రెడ్డి, ప్రొఫెసర్ సురేష్ బాబు, ప్రొఫెసర్ జి లక్ష్మయ్య, ప్రొఫెసర్ ఎన్ వి శ్రీనివాస్, డాక్టర్ సి శ్రీకాంత్ రెడ్డి, ప్రొఫెసర్ ఎం వి కృష్ణ రావు, రాధా కృష్ణ ప్రసాద్ ఇతర సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.