టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ 19వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం క్లస్టర్ నెం 06 కావూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 19వ రోజు రిలే నిరాహార దీక్షలో నరసరావుపేట పట్టణ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జి డా చదలవాడ అరవింద బాబు పూలమాల వేసి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా చేతులకు సంకెళ్లు వేసుకొని దీక్షలో కూర్చున్నారు.
previous post