కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్ -పెట్రోలు ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రములో మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.