మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాప్రా సర్కిల్ కాప్రా డివిజన్ లోని అశోక్ మణిపురి కాలనీలో ఇన్స్పైర్ టేబుల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు హాజరై మొదట జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. ఇన్స్పైర్ టేబుల్ టెన్నిస్ అకాడమీ నుంచి దేశానికి వన్నె తెచ్చే అద్భుతమైన ప్లేయర్లను తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్ ప్రణీత్ సార్డ హెడ్ కోచ్ ఆఫ్ అకాడమీ ఫౌండర్ కే. కిరణ్ కుమార్, పి .ప్రభాకర్ రాజు తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అకాడమీ సెక్రటరీ, ఇబ్రహీం ఖాన్ టేబుల్ టెన్నిస్ అకాడమీ ట్రెజరర్ ,భాస్కర్ రావు టేబుల్ టెన్నిస్ అకాడమీ ఇన్వెస్టర్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు టిఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి ,గరిక సుధాకర్, సుడుగు మహేందర్రెడ్డి, గిల్బర్ట్, శ్రీనివాస్, సురేఖ, దేవి, రాజు, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.