పేదలదంరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు పట్టణ పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్థానిక ఎల్.జీ. భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే జగన్ ప్రభుత్వం కూడా పేదలకు ఇండ్ల పంపిణీపై తాత్సారం చేస్తోందని విమర్శించారు. జగన్ తన పాదయాత్రలో పేదలందరికీ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని, తీర ప్రభుత్వంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. 50 గజాలలో కేవలం లక్ష రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టుకోమంటే పేదలు ఎలా కట్టుకోగలరని రెడ్డి శంకరరావు ప్రశ్నించారు. ఇదే నా నవ రత్నాలలో జగన్ ఇచ్చిన హామీ అని తన పాదయాత్రలలో పేదలందరికీ ఉచితంగానే ఇండ్లు కట్టిఇస్తానని చెప్పిన మాటలకు అర్దం ఇదేనా అని ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వం కట్టిన టిట్కో ఇండ్లలో కూడా ఇండ్లు కట్టుకునేందుకు ముందుకువచ్చిన లబ్దిదారుల నుంచీ 3 లక్షలు చెల్లిస్తేనే పూర్తి చేయగలగుతామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈనేపధ్యంలో ఇండ్ల నిర్మాణాలపై ఈ రోజు నుంచీ నగరంలో నిరసన ఉద్యమం నిర్వహిస్తామని అలాగే ఇండ్ల నిర్మాణాలను నిరసిస్తూ ఈ నెల 28 ధర్నా నిర్వహిస్తున్నట్టు పట్టణ పౌర సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.
previous post