36.2 C
Hyderabad
May 12, 2024 15: 49 PM
Slider నల్గొండ

పూలు చల్లటం కాదు పూట గడిచేలా చూడాలి

#Municipal Workers

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్మికులకు  కనీస వేతనం 24000 చెయ్యాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బి.నాగిరెడ్డికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం కార్మికులతో రోషపతి మాట్లాడుతూ 11వ పిఆర్సిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అందులో భాగంగానే జూలై 9న ఎమ్మెల్యేలకి వినతి పత్రం ఇవ్వడం, జూలై 14 15 16 తేదీలలో నిరాహారదీక్షలు మున్సిపల్ కార్యాలయాల వద్ద చేయాలని, జూలై 20న చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కెసిఆర్ కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కషాల ముత్తమ్మ, మెరుగ దుర్గారావు, కుమారి, చంద్రకళ గోవిందమ్మ, గురవమ్మ, సైదులు, పుల్లయ్య, నాగరాజు, రవి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హెల్త్ ఐటి:ఆసుపత్రుల్లో రోగుల సేవలపై నజర్

Satyam NEWS

317 జీవో సమస్యల పరిష్కారానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం నిరసన

Satyam NEWS

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’

Satyam NEWS

Leave a Comment