కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండ రెంజల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితను ఇతర గ్రామానికి బదిలీ చేయవద్దని ఆ గ్రామానికి చెందిన సుమారు వంద మంది జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇటీవల బండ రెంజల్ పంచాయతీ కార్యదర్శి అనితను పిట్లం మండలం ధర్మారం గ్రామానికి బదిలీ చేశారు. అయితే ఆ కార్యదర్శి వల్ల తమకు అనేక పనులు అవుతున్నాయని, ఆమెను ఇతర గ్రామానికి పంపవద్దని కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు ఆ గ్రామస్తులు.
గ్రామంలో ప్రతి కార్యక్రమాన్ని ఆమె విజయవంతం చేసారని, ఆమె రాకముందు గ్రామం మరొకలా ఉండేదని, ఆమె వచ్చిన తవత గ్రామ రూపురేఖలు మారాయని చెప్పారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా గ్రామానికి వచ్చేదని, చివరికి బతుకమ్మ పండుగ సైతం గ్రామస్తులతోనే జరుపుకుందని గ్రామస్తులు తెలిపారు. ఆమె బదిలిని వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు