సీపీఎస్ ,జీపీఎస్ లు మాకు వద్దని…ఓ పీ.ఎస్ మాత్రమే కావాలంటూ జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరాహారదీక్షలకు దిగుతోంది… యూటీఎఫ్. ఈ మేరకు ఏపీ శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు…సీపీఎస్ కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఈ నెల 18 నుంచీ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు..యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ మినిస్ఠీరియల్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూక లలో ఈ నెల 20 నుంచీ దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఈశ్వరరావు మాట్లాడారు.
previous post