ఒంగోలు భారీ భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్న ఉహేక్షించేది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసలరెడ్డి అన్నారు. అయితే ఈ భూకుంభకోణం విచారణను బాలినేని శ్రీనివాసులరెడ్డితోనే ప్రారంభించాలని సిట్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ భూ కుంభకోణం వెనుక బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి, బాలినేని వియ్యంకుడు భాస్కర్రెడ్డి, బాలినేని అనుచరులు ఉన్నారని టిడిపి వర్గీయులు బాలినేనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
సోమవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒంగోలులో జరిగిన భూకుంభకోణం (ప్రకంపనలు సృష్టిస్తుందని బాలినేని శ్రీనివాసులరెడ్డి తొలుత ఇందులో ఉన్న వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలి అని ప్రకటించారు అయితే విచారణ బాలినేనితోనే (ప్రారంభమవ్వాలని అందులో ఆయన కుమారుడు, వియ్యంకుడు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు అందరు ఈ భారీ భూకుంభకోణంలో ప్రధాన నిందితులు అని ఆరోపించారు.
డిప్యూటి మేయర్ నెలనాటి మాధవ రాజీవ్నగర్లో ముఠాను ఏర్పాటుచేసుకొని అక్కడి స్థలాలు ఆక్రమిస్తున్నారు. ఆ (ప్రాంతంలో 66 గదులు కబ్బాచేశారు. అందులో ఒకరు (బ్రాహ్మణుడు కుటుంబం, చౌదరి కుటుంబం. ఆ (బ్రాహ్మణకుటుంబం౦ కుమార్తె వివాహం WERE స్ధలం వద్దకు వెళితే ఆ స్ధలం తాను కొన్నాని దొంత పత్రాలతో వెలనాటి మాధవ తిష్టవేసి ఉన్నాడని అన్నారు.
బాలినేని శ్రీనివాసులరెడ్డికి మరో అనుచరుడు డిప్యూటి మేజర్ వేమూరి బుజ్జి ,బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్రెడ్డితో కలిసి చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మెన్ గురునాధంతో కలిసి పట్టణంలోని ఓ హోటల్లో కూర్చుని శ్రీకర్ విల్హాస్లో ఉన్న రైతులను బలవంతంగా పిలిపించుకొని 4.50 ఎకరాలకు సంబంధించి కొణిజేడు బస్టాండ్ సమీపంలో కాపు సామాజిక వర్గానికి చెందినరైతు, లాయర్ఫేటలో వైశ్య సామాజిక వర్గనికి చెందిన రైతు ఇద్దని పిలిపించి బలవంతంగా వారి భూమిలో మూడోవంతు తక్కువగా చూపించి వారి వద్ద ఉన్న దొంగ డౌక్యుమెంట్లు చూపించి కైవసంచేసుకున్నారు అని తెలిపారు.
విల్లలో భాస్కర్రెడ్డికి ఉన్నది 18 ఎకరాలు అయితే 40 ఎకరాల్లో వెంచర్ ఎలా వేశాడని ప్రశ్నించారు. భూములను ఇదే విధంగా కాజేశాడనేందుకు ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలినేనికి కర్తక్రియలాంటి స్నేహితులు ఉన్నారని వారి దేహాలు వేరైన వారందరు ఒకటే అని అన్నారు. వారిలో దుంప శ్రీనివాసులరెడ్డి, బలిజపల్లి భక్తవత్సలరెడ్డి వీళ్ల చేసిన వ్యవహారం బాలినేనికి తెలియదంటే హాస్యాస్పదమే అని అన్నారు.
వీరు భాగ్యనగర్ రిజిస్ట్రేషన్కార్యాలయం సమీపంలోని భవంతిని అక్కతమ్ముడు మద్య వచ్చిన వివాదంలో జోక్యం చేసుకొని బిల్జింగ్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగడాక్యుమెంట్లు సృష్టించి మీరు అమ్మకపోతే ఇతరులు వద్ద ఉన్న కాగితాలతో కొనుగోలుచేస్తావుని ఆభవంతిని కాజేశారన్నారు. అలాగే అనంతపురం కు చెందిన (బ్రాహ్మణలకు చెందిన స్థలం రాజీవ్నగర్లో 36 గదులు ఉంటే ఆ స్థలంలో శ్రీనివాసలరెడ్డి అపార్ట్మెంట్ కడుతున్నాడు. అక్కడ నుంచి వారిని తరిమేసి అ భూమిపై దొంతపత్రాలు సృష్టించి కైవసం చేసుకున్నారు.
సిట్ విచారణ ప్రారంభించడంతో వీరందరిని ఎమ్మెల్యే బాలినేని బెంగుళూరులో పచ్చిమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు చెందిన Br) బిల్లింగ్లో సెక్యూరుగా పెట్టారని తెలిపారు. బాలినేని శ్రీనివాసులరెడ్డిని 25 సంత్సరాలుగా ప్రజలు ఎన్నుకుంటే ప్రజలపై విషం కక్కారు. ప్రజలు తమ ఆస్థులు తమ పేరుపై ఉన్నాయోలేదో పరిశీలించుకోవాలన్నారు.
వీరిని సహకరించిన అధికారులు ఎవరు, భూములు ఖాళీగాఉన్నాయని చెప్పిందెవరు వీరికి సహకరించిన తహసిల్వార్డు, స్వేలు ఎవరు వీరందరు ప్రమేయం లేకుండా ఇంత పెద్ద బూకుంభకోణం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇది స్టాంపుల కుంభకోణ౦ కంటే EO అని అన్నారు. సిబిఐ దృష్టికి, సిబిసిఐడి దృష్టికి తీసుకొని వెళుతామన్నారు. సిట్విచారణలో అధికారులు ప్రధాన నిందితులను తప్పించాలని చూస్తే ఇబ్బంది పడుతారు. బాలినేని వలన అనేక మంది అధికారులు సస్పెడ్ అయ్యారు.
బాలినేని కుమారుడు సంతమాగలూరు రౌడీలను తెచ్చి ఆరు ఎకరాలు కజ్జాచేశారని ఆరోపణలు ఉన్నాయి. వీటికి కొనసాగింపు ఈ భూకుంభకోణం అని విమర్శించారు. బాలినేని కుమారుడు ప్రణీత్ వద్ద లాయర్ పేటకు చెందిన ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని పట్టుకొని వస్తే అన్ని విషయాలను బయటకు వస్తాయని సిట్ అధికారులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి బంధువు, వియ్యకుం౦డు, కుమారుడు మెతకవైకరి ప్రదర్శిస్తే అధికారులు ఇబ్బందులు పడుతారుఅని తెలిపారు.
గతంలో బాలినేని వలన మురళి, చిరంజీవి అనే తహసిల్వార్లు సస్పెండ్ అయ్యారు. గంటా రామానాయుడు కొండపై ఉన్న స్థలాన్ని చదునుచేసి బాలినేని కుమారుడు ప్రణీత్రెడ్డి ఒకరాజులాగా అక్కడ ERE) కట్టేలా రామానాయుడు చేస్తున్నాడు. కఠారి శంకర్ సివిఎన్ రీడింగ్రూమ్ స్థలాన్ని కబ్బాచేశాడు. పట్టణ నడిబొడ్డునున్న రూములకు అతను రెంట్లు కట్టకుండా ఉన్నాడు. వీరందరు ఇలా చేస్తుంటే బాలినేనికి ఏమి తెలియదా అని ప్రశ్నించారు.
బాలినేని మంచి నాయకుడు అని ప్రజలు ఆదరించి మంత్రిగా, ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ఇస్తే బాలినేని మాఫియా డౌన్ లాంటి కుమారుడిని తయారు చేసుకొని వారిని వారసత్వంగా ఎమ్మెల్యే టిక్కెట కావాలా ఒంగోలులో అని ప్రశ్నించారు. ప్రజల ఉసురు తగులు తుంది. ప్రజలందరు మీ ఆస్థిపాస్తులు మీపేరుపై ఉన్నాయోలేదో పరిశీలించుకోవాలన్నారు. ఇబ్బందులు ఉన్న వారికి టిడిపి లీగల్ సెల్ సహకారం అంజేస్తుందని తెలియజేశారు.