ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పంజాబ్లో చేదు అనుభవం ఎదురైంది. రోపార్లో ఆమె కారును అడ్డగించారు అన్నదాతలు. రైతు నిరసనలపై ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నదాతలు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న నటి కంగనా రౌనత్, ఇటీవల మరో వివాదంలో చిక్కుకుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్, రైతులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి చిక్కులు తెచ్చుకుంది.
సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చితకబాదినట్లు, బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కంగన. ఇలాంటి వారికీ అలాంటి గురువు కావాలంటూ రాసుకొచ్చారామె.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కంగన రనౌత్. ఈ నేపథ్యంలో రోపార్లో ఆమె కారును అడ్డగించారు రైతులు. కంగన గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు మహిళా రైతులు. రైతు ఉద్యమంపై చేసిన కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు.