పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చుతూ ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబీ యువకుల్లో మూసీవాలాకు మంచి క్రేజ్ ఉంది.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్ధూ సమక్షంలో మూసీవాలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నవజ్యోత్సింగ్ సిద్ధూ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మూసీవాలా యూత్ ఐకన్.. అంతర్జాతీయ సెలబ్రిటీగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. కాంగ్రెస్ కుటుంబంలో చేరాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.