భారత్ ను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వేరియంట్ మరో 44 దేశాలకు కూడా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వేరియంట్ బి.1.617 ను ముందుగా భారత్ లో కనుగొన్నారని, ఇది ఇప్పుడు 44 దేశాలకు విస్తరించడం ఆందోళనకరమని వారన్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఈ కొత్త వేరియంట్ భారత్ లో కనుగొన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్ ను ఊపేస్తున్న ఈ వేరియంట్ బ్రిటన్ లో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నదని వారు వెల్లడించారు. ఏ రకమైన చికిత్సకు లొంగని ఈ వేరియంట్ ప్రమాదకారిగా కనిపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేరియంట్ అతి త్వరగా వ్యాపిస్తున్నదని ముందు వచ్చిన వైరస్ కన్నా వేగంగా ప్రయాణిస్తున్నదని వారన్నారు.
previous post