29.7 C
Hyderabad
May 1, 2024 05: 39 AM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలి

#uttam

విద్యా, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. బుధవారం  ముందుగా స్థానిక హుజూర్ నగర్,   ఏరియా ఆసుపత్రిని సహచర మంత్రులైన  రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,  రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో కలసి పరిశీలించి రోగుల వార్డులలో కలియ తిరిగి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతం ఏర్పాటు చేసిన వైద్య వసతులపై వైద్యాధికారులతో సమావేశంలో  మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని,పేద, నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవాలందలని అన్నారు. నియోజకవర్గంలో మారుమూల మండలాల నుండి వచ్చే రోగులకు కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవాలందలని, వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని అన్నారు. హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఉన్న పి హెచ్ సి లలో వసతుల కల్పన,ఏరియా ఆసుపత్రిలో కావలసిన వసతులపై ప్రతిపాదనలు సత్వరమే అందించాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కింద 1800 వ్యాధులకు 487 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని,రాజీవ్ ఆరోగ్యశ్రీ ని 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలని,అన్ని ఆసుప్రతులలో డైట్,శానిటేషన్,డ్రగ్స్ కొరత లేకుండా ఉంచాలని,ఏ ఒక్క పేషంట్ కూడా బయట మందులు కొనుగోలు చేయకుండా ఉండాలని,రోగులకు సర్కార్ దవఖానాలపై విశ్వాసం పెరగాలని అన్నారు.

ప్రభుత్వం ఇటీవల స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు అందించిందని,త్వరలో  వైద్యాధికారుల నియామకాలు చేపట్టటం జరుగుతుందని అన్నారు.సూర్యాపేటలో మెడికల్ కళాశాల సమస్యను త్వరలో పరిష్కరించి శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

పేద,నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం

కోదాడ నియోజకవర్గ కేంద్రంలో 26 కోట్ల రూపాయలతో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సిటీ స్కాన్,టి ఫా అల్ట్రా సౌండ్ సెంటర్  మంజూరుకు అంగీకారం తెలిపారు.మంత్రులు రాజ నర్సింహ, నలమాద ఉత్తమ్ రెడ్డి,తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ పేదల ప్రభుత్వంలో పేద,నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అందాలని ఆ దిశగా వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేవాలందించాలని  సూచించారు. బుధవారం స్థానిక 14 వార్డులో 26 కోట్ల రూపాయలతో చేపట్టే 100 పడకల ప్రాంతీయ వైద్య శాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పం అర్హులైన పేదలకు మెరుగైన వైద్యం అందాలని హైదరాబాద్ తరహాలో  జిల్లాలోని సూర్యాపేట,హుజూర్ నగర్,కోదాడ లలో అందాలని అలాగే ప్రతి పి హెచ్ సి లలో మందుల కొరత ఉండకుండా చూడాలని సూచించారు. హుజూర్ నగర్,కోదాడ లలో చెరో చోట సిటీ స్కాన్,టిఫా అల్ట్రా సౌండ్ లను మంజూరు చేస్తున్నట్లు వారంలో ఏర్పాటు చేయాలని  సూచించారు.

తదుపరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని,పేదలకు నమ్మకం,విశ్వసం పెరగాలని వైద్యులు ఆదిశగా సేవాలందించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రెడ్లకుంట  గ్రామానికి కింద 5 వేల ఎకరాల సాగుకు 47 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచామని,త్వరలో లిఫ్ట్ ప్రారభించుకుంటాని, మరికొన్ని లిఫ్ట్ ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేశామని తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు నీరు,రోడ్లకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని, ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు తప్పక  అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రుల వారీగా వసతుల కల్పనపై సమీక్షించారు.

ఈ సమావేశంలో శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మవతి,ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిష్టినా,కమిషనర్ అజయ్,డైరెక్టర్ ఆర్.వి.కర్ణన్,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు సి.హెచ్.ప్రియాంక,ఎ. వెంకట్ రెడ్డి,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటా చలం,ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రెడ్డి,కరుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ లు,జడ్పీటీసీ లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజుర్ నగర్

Related posts

ఆనంద్ తేల్తుంబ్దే, గౌతమ్ నవలఖాల అరెస్టు ఖండిస్తున్నాం

Satyam NEWS

కిలో బంగారం స్వాధీనం

Sub Editor

సెక్రటేరియట్ నిర్మాణంలో ఇవాళ ముఖ్యమైన ఘట్టం

Satyam NEWS

Leave a Comment