39.2 C
Hyderabad
April 28, 2024 12: 22 PM
Slider పశ్చిమగోదావరి

కిటకిటలాడుతున్న బలివె రామలింగేశ్వరాలయం

#baliveramalingeswara

హర హర మహాదేవ   శంభో శంకరా  అంటూ భక్తుల శివనామ స్మరణతో ఏలూరు జిల్లా ముసునూరు, పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శనివారం మారు మ్రోగింది.  మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి, రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ తో కలిసి బలివే రామస్వామిని దర్శించి పూజలు చేశారు. ఎన్నో ఏళ్లకు అరుదుగా శనివారం  శని త్రయోదశి కలయికతో రెండూ ఒకేసారి రావడం అదేరోజు మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం భక్తుల పాలిట అరుదైన వరంగా మారింది.

దీంతో భక్తులు శని వారం బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించడానికి లక్షల్లో తరలి వచ్చారు. బలివే అంతా భక్తులతో శని వారం కిట కిటలాడింది.  తమ్మిలేరులో  ఈరోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి బలివే ఉత్సవాలకు వచ్చిన 30 వేల మంది భక్తుల కు అల్పాహార విందు కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి చేతులమీదుగా భక్తులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఏ తో పాటు దెందులూరు నియోజక వర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొని భక్తులకు సేవలందించారు.

Related posts

ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో డీసీఆర్బీ ఒక్క‌ రోజు నివేదిక….!

Satyam NEWS

అభిలాష్ ఆకర్ష్ అధికార పార్టీ నాయకులకు చెమటలు

Satyam NEWS

Leave a Comment