వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన నాటి నుంచి ఖాళీగానే ఉన్న నిఘా విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ పీఎస్ఆర్ ఆంజనేయులు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం డిజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏసీబీ డీజీగా నియమించారు. ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ ఏడీజీగా శంక బ్రత బాగ్చిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
previous post