39.2 C
Hyderabad
May 3, 2024 14: 20 PM
Slider నల్గొండ

ప్రజా సంక్షేమమే పరమావధిగా కోతి సంపత్ రెడ్డి సేవ

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రంలోని మూడో వార్డులో పలుచోట్ల మిషన్ భగీరథ లీకేజీలకు మూడవ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మరమత్తులు చేయించారు.

మూడవ వార్డు పరిధిలో సుమారు 9 చోట్ల మిషన్ భగీరథ పైపులు తెగిపోయి నీటితో రోడ్డు మొత్తం జలమయం అవుతున్న విషయాన్ని వార్డు ప్రజల ద్వారా సమస్యను తెలుసుకున్న మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి సోమవారం వాటిని మరమ్మతులు చేయించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చిన ప్రతిఒక్క సమస్యని,మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.మిషన్ భగీరథకు సంబంధించి మొదటిగా సి సి రోడ్డు నిర్మాణం ప్రణాళికలు చేసినటువంటి వీధులలో గత ఎనిమిది రోజులుగా 5 ప్రదేశాలలో మరమ్మతులు చేయించినట్లు,తన దృష్టికి వచ్చిన మిగిలిన ప్రదేశాలలో కూడా వీలైనంత త్వరగా మరమ్మతులు చేయించడం జరుగుతుందని,మూడవ వార్డులో సుమారు 45 గృహాలకు మిషన్ భగీరథ కనెక్షన్స్ ఇంకా ఇవ్వలేదని,వెంటనే ఆ ఇండ్లకు కూడా కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కరోనా అదుపు కోసం ఫోరం ఫర్ బెటర్ విజయనగరం అవగాహన ర్యాలీ

Satyam NEWS

ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు వద్దు: సీపీఎం

Satyam NEWS

సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు

Satyam NEWS

Leave a Comment