పల్స్ పోలియో కార్యక్రమం తిరుమలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. తిరుమలలో మొత్తం 25 ప్రాంతాల్లో పల్స్పోలియో కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వీటిలో భక్తుల కోసం 18 స్థానికుల కోసం 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీ వారి ప్రధాన ఆలయం ముందు 5సం”లోపు వయసు కలిగిన పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని అదనపు ఇఓ ధర్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి తల్లి, తండ్రి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదనపు ఇఓ ధర్మారెడ్డి కోరారు.
previous post