పంజాబ్ కాంగ్రెస్లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. సిద్ధూతో విభేదాల కారణంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో సిద్ధూ, చన్నీ మధ్య కూడా పొగడం లేదన్న వార్తలు పంజాబ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ సీనియర్ నేతల కీలక సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. దీంతో అసహనానికి గురైన చన్నీ.. మీరు సీఎం పదవిని తీసుకుని, రెండు మాసాల్లో ఏం చేస్తారో చేసి చూపించాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం కాస్త తీవ్రంగానే సాగినట్లు సమాచారం.
సిద్ధూ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చన్నీ స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీ పరిశీలకుడు హరీశ్ చౌదరీ, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కృష్ణ అల్లవరు, పంజాబ్ కేబినెట్ మంత్రి ప్రగత్ సింగ్ సమక్షంలోనే అంతా జరిగినట్లు తెలుస్తోంది.