38.2 C
Hyderabad
April 29, 2024 11: 46 AM
Slider జాతీయం తెలంగాణ

యుద్ధ విమాన టైరును దొంగలించిన దుండగులు

ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం ఫైటర్‌ జెట్‌ టైర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాజస్థాన్‌లోని లక్నో ఎయిర్‌బేస్‌ నుంచి జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌కు యుద్ధ విమానాన్ని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుంచి జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు మిరాజ్- 2000 ఫైటర్‌ జైట్‌ను రాత్రి ట్రక్కులో తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి 12 గంటల 30నిమిషాల నుంచి 1గంటల వరకు షహీద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రక్కు నెమ్మదిగా ముందుకు కదులుతుండడంతో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు చాకచక్యంగా టైరును అపహరించారు.

కాగా దొంగలు టైరును కట్టేందుకు ఉపయోగించే పట్టీని ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని ట్రక్‌ డ్రైవర్‌ చెబుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షహీద్‌ మార్గంలోని CCTV పుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Related posts

పంద్రాగస్టు

Satyam NEWS

15 నిమిషాలు ఆలస్యమైనా ప్రాక్టికల్స్ కు అనుమతి

Sub Editor 2

తెలంగాణ ప్రజా సేన, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ కి సన్మానం

Satyam NEWS

Leave a Comment