సమాచార పౌర సంబంధాల శాఖ కడప జిల్లా పౌరసంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా సిహెచ్.పురుషోత్తం శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు టి.విజయకుమార్ రెడ్డి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు అదే శాఖ కార్యాలయంలో కడప డివిజనల్ పౌరసంబంధాల అధికారిగా భాద్యతలు నిర్వహిస్తున్న ఆయన.. పదోన్నతి పొంది డిపీఆర్ఓగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ ఏడి పి.వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది డిపిఆర్ఓ పురుషోత్తం కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం డిపిఆర్ఓ సిహెచ్.పురుషోత్తం మాట్లాడుతూ.. మొదటగా కడప జిల్లా రాజంపేటలో ఉద్యోగ విధులు ప్రారంభించి… కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో పనిచేసి, 2017 నుండి డివిజనల్ పిఆర్ఓగా జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం డిపిఆర్ఓ గా పదోన్నతి పొందడం జరిగిందన్నారు. ఈ జిల్లాలో అన్ని శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు సుపరిచితమేనని, పదోన్నతిపై తిరిగి ఇదే జిల్లాలో బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ.. శాఖా పరంగా, జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేయడానికి కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు.