సినిమా టిక్కెట్ల వ్యవహారంపై జగన్ కీలక వ్యాఖ్యలు
రేట్ల తగ్గింపును వ్యతిరేకించే వారు పేదల వ్యతిరేకులే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారి సినిమా టిక్కెట్ల వ్యవహారంపై బహిరంగంగా స్పందించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి మంచి పనిని కొంత మంది విమర్శిస్తున్నారని అంటూ సినిమా టిక్కెట్ల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ‘విమర్శలు చేసే వారు చివరకు అందుబాటు ధరలో వినోదాన్ని అందించాలని సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తే ఆ నిర్ణయంపై కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్లు పేదల గురించి ఆలోచన చేసే వాళ్ళేనా. ఇటువంటి వారు పేదల గురించి పట్టించుకునే వారేనా?.ఇటు వంటి వారు అంతా పేదల వ్యతిరేకులు.పేదవాళ్ళకు వీళ్లు శత్రువులు కాదా అని అందరూ ఆలోచించాలి’ అంటూ వ్యాఖ్యానించారు.