సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గులను వెంటనే పట్టుకొని శిక్షించాలని హుజూర్ నగర్ నియోజకవర్గ పివి రావు మాల మహానాడు అధ్యక్షుడు కోలపూడి యోహాన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిమల్ల నరసింహారావు, తెలంగాణ పీవీ రావు మాలమహానాడు వ్యవస్థాపకుడు మేకల కోటేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం స్వరూప, తదితరులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయటం హేయమైన చర్య అని,కొందరు దుర్మార్గులు కావాలనే కులాలకు, మతాలకు చిచ్చుపెట్టి గొడవలు సృష్టించాలని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ రాజకీయ శక్తులు అండదండలు ఉన్న ప్రభుత్వం వారిపై వెంటనే తగిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సూదుల రాములు, జిల్లా మహిళా అధ్యక్షురాలు జక్కి జైకన్య, జిల్లా ఉపాధ్యక్షుడు సాలె గోపి, హుజూర్ నగర్ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కందుల నాగలక్ష్మి, మఠంపల్లి మండల అధ్యక్షుడు మామిడి వీరస్వామి, హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి బాబురావు, మఠంపల్లి యూత్ అధ్యక్షుడు మామిడి నితిన్ తదితరులు పాల్గొన్నారు.