71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు వచ్చారు.
ముందుగా త్రివర్ణ పతాకాన్ని అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట నియోజకవర్గ ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేసారు. బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసలుగా, నిస్సహాయులుగా, జీవిస్తున్న మనకు ఎందరో మహానుభావులు చేసిన స్వాతంత్ర పోరాటాల కారణంగా స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు.
వారు చేసిన ఉద్యమాలు, త్యాగాలు, మూలంగా బానిస సంకెళ్ళు తెంచుకొని మువెన్నల జెండాను ఎగురవేసి మనం ఈనాడు స్వచ్చంగా, జీవిస్తున్నామని డాక్టర్ చదలవాడ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలకు నిదర్శనం మొన్న జరిగిన రాష్ట్ర రాజధాని విభజన బిల్లును శాసన మండలి చైర్మన్ షరీఫ్ తనకున్న విశేష అధికారంతో సెలక్ట్ కమిటీకి పంపించడమేనని అన్నారు.
స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను కేవలం గోడలపైన కాకుండా మన అందరి హృదయాలను నిలుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన భారత రాజ్యాంగం ఎంతో విలువైనదని ఈ సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఒకసారి స్మరించుకోవలిసిన బాధ్యత మన అందరిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ బాబు అందరిచేత జాతీయగీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో వేల్పుల సింహాద్రి యాదవ్, కడియాల రమేష్, వెన్న బలకోటి రెడ్డి, బండరుపల్లి విశేశ్వరావు, గట్టుపల్లి సత్యనారాయణ, గంగుల పెద్దిరెడ్డి, మక్కెన ఆంజనేయులు, కరిముల్లా, కడియం కోటీసుబ్బరావు, కొండలు, కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, బాషా, వాలి, రాము, పెరికాల రాయప్ప, పవన్, సుభాని, బలస్వామి, విజయలక్ష్మి, పార్వతి, కుమారి, సింధు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.