సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సాయి ప్రభాత్ నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో రధ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు పొంగలి ప్రసాదం తయారు చేసి విష్ణ భగవానుడికి, శ్రీ సూర్య భాగవానుడికి నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం,ఆదిత్య హృదయ పారాయణం చేశారు.
ఆలయ అర్చకులు నల్లపాటి హనుమకుమార్ ఆధ్వర్యంలో శ్రీ షిర్డీ సాయిబాబా వారికి,సూర్య భగవానుని, శ్రీ మహా విష్ణు భగవానునికి ప్రత్యేక పూజలు,అష్టోత్తరం, మహా మంత్రపుష్పం,నీరాజనం,ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు, కోశాధికారి తొడుపునూరి శేఖర్, తమ్మన నాగేశ్వరరావు,వూరే వెంకయ్య, ఓరుగంటి రాజ్యలక్ష్మి,వంకాయల పద్మ,తమ్మన సుజాత,గుండా సుగుణ, వూరే ఇందిర,శ్రీలక్ష్మీ,గీత,లలిత,గజ్జి విజయలక్ష్మి,ఆత్కూరి సీత,వూరే వసంత,మహిళలు భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్,హుజూర్ నగర్