37.2 C
Hyderabad
April 26, 2024 19: 45 PM
Slider నల్గొండ

కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ చెక్కులను వెంటనే పంపిణీ చేయాలి

#dsrtrust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పేదింటి ఆడ బిడ్డల వివాహాల కోసం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసే కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను వెంటనే ఇవ్వాలని డి.యస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబూరావు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ చెక్కులు రెవెన్యూ కార్యాలయానికి వచ్చి నెలలు   గడుస్తున్నా అధికారులు మాత్రం చెక్కులు పంపిణీకి సమయం కేటాయించకపోవడం వల్ల అట్టి చెక్కులు కార్యాలయంలోనే మూల్గుతున్నాయని అన్నారు.వివాహం  కోసం అప్పులు చేసి ఆడ బిడ్డల పెళ్లి చేసిన తల్లుదండ్రులకు అప్పుల భారం పెరిగిపోతోందని,త్వరిత గతిన చెక్కులు పంపిణీ చేస్తే కొంత ఋణ భారం తగ్గుతుందని వెంటనే చెక్కులు పంపిణీ చెయ్యలని అన్నారు.లేనియెడల స్వచ్ఛంద సంస్థలు,ప్రజా సంఘాలు  తల్లిదండ్రులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు  చేస్తారని బాబురావు అన్నారు. 

ఈ కార్యక్రమాల్లో గడ్డం అంజి, బాలాజీ నాయక్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన రావి కొండలరావు

Satyam NEWS

జగన్ ను వీడి చంద్రబాబుతో కలిసిన మోహన్ బాబు

Satyam NEWS

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

Satyam NEWS

Leave a Comment