రథసప్తమిని పురస్కరించుకొని అలంపూర్ తుంగభద్రాన్ని తీరాన వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రాథః కాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు .పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ఉత్సవిగ్రహాలు సూర్య వాహనంపై ఆసీనులను చేశారు.
ఆలయ అధికారి పురేందర్ కుమార్ గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు . వాహనం పుర వీదుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి వారి వారి భక్తిని చాటుకున్నారు