వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ మొబిలైజేషన్లో భాగంగా శనివారం సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ నిర్వహించారు. నగర శివార్లలోని రాజీవ్ స్మృతి వనం వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ లో ఏ.ఆర్ సిబ్బందికి ఏ.ఆర్ పోలీసు అధికారులు ఫైరింగ్ లో మెళకువలు వివరించారు. ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
దీంతో పాటు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో తుపాకీ ని ఎలా ఉపయోగించాలి..తుపాకీ నిర్వహణ, ఎస్.ఎల్.ఆర్ తుపాకీతో డ్రిల్ నిర్వహణపై ఏ.ఆర్ పోలీస్ ఉన్నతాధికారులు మెళకువలు నేర్పించారు. కార్యక్రమంలో ఆర్.ఐ సోమశేఖర్ నాయక్, ఆర్.ఎస్.ఐ లు, ఏ.ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.