కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, అనుచరులు.. ఎంపీ బాలశౌరి అనుచరుడిపై దాడి చేశారు. 3 నెలల క్రితం జరిగిన సీఎం పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి అనుచరులతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులకు మధ్య చెలరేగిన విభేదాలు ఇప్పుడు మళ్లీ పురివిప్పాయి. నాగాయలంక లో జరిగిన నాబార్డు చ్చైర్మన్ జోషి పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ బాలశౌరి, అనుచరులపై నేడు దాడి చేశారు.
సభానంతరం బాలశౌరి అనుచరులను చెప్పులతో కొడుతూ ఎమ్మెల్యే అనుచరులు అవమానించారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా పై కూడా ఎమ్మెల్యే సింహాద్రి మేనల్లుడు దాడి చేశాడు. మీడియా ప్రతినిధులను బూతులు తిట్టి ఫోన్ పగులగొట్టాడు. సమావేశం జరిగే సమయంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో కూడా గొడవ జరిగినట్లు సమాచారం.