అభివృద్ధి పనుల్లో రఘునాథపాలెం మండలం మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలంలో రూ.1.92కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో, ఎస్డిఎఫ్ , సుడా నిధులు బావోజీ తండా గ్రామంలో రూ.39.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు. రాముల తండా గ్రామంలో రూ.35.69 లక్షలతో హైమస్ట్ లైట్స్, గ్రామంలో నిర్మించిన 5-సీసీ రోడ్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
గడ్డికుంట తండా, మల్లేపల్లి గ్రామంలో రూ.11.50 లక్షలతో చేపట్టిన 2-అభివృద్ధి పనులు, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
పరికలబోడు తండా గ్రామంలో రూ.31.50 లక్షలతో చేపట్టిన 7 అభివృద్ధి పనులు, హై మాస్ట్ లైట్స్ ను మంత్రి ప్రారంభించారు.జింకల తండా గ్రామంలో రూ.54.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్స్, డ్రెయిన్స్ ఇతర అభివృద్ది పనులు, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు.రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన జింకల తండా గ్రామ పంచాయితీ కార్యాలయం ను మంత్రి ప్రారంభించారు.