విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాలతో పలు పోలీస్ స్టేషన్ ల పరిధిల్లో ఆయా స్టేషన్ సిబ్బంది దాడులు చేసారు. జిల్లాలోని జియ్యమ్మవలస మండలం బిల్లమానుగూడ, చినగోర గ్రామాలలో సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసారు. ఈ మేరకు మూడు వేల లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలను ధ్వంసం చేశారు.
అదే విధంగా ఎల్. కోట మండలం నీలకంటాపురం లో సారా తయారీ కేంద్రాలపై స్థానిక పోలీసులు దాడి చేసి వెయ్యి లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలను ధ్వంసం చేశారు. ఇక పాచిపెంట మండలం యారల్లవలసలో రెండు ద్విచక్ర వాహనాలపై సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాచిపెంట పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి 200 సారా పేకెట్లు, రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
ఇక వేపాడ మండలం కొంపల్లి లో కూడా నాటు సారా తయారీ కేంద్రాలపై వల్లంపూడి పోలీసులు రైడ్స్ నిర్వహించి, 40 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.ఈ మేరకువల్లంపూడిఎస్ఐ దేవీ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.