మటన్ నాణ్యతను పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్. బి. కాలనీ డివిజన్ లోని వెంకటేశ్వర నగర్ లో బబ్లు మటన్ మార్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిదులుగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గోల్లూరి అంజయ్య, గుండారపు శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మటన్ షాప్ లో సుచి శుభ్రత పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన మటన్ ను అందించాలని నిర్వాహకులకు సూచించారు. వ్యాపార రంగంలో బాగా రాణించాలని దీవించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చందు ,బబ్లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, బాలరాజు,నవీన్ గౌడ్, రమేష్, చంద్రశేఖర్, సాయి కుమార్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.