27.7 C
Hyderabad
May 7, 2024 09: 36 AM
Slider నల్గొండ

రైల్వే సిగ్నల్ వ్యవస్థను పెంచి ప్రమాదాల నుండి కాపాడాలి

#yaragani

ఒడిస్సా లో జరిగిన అత్యంత ఘోరమైన మూడు రైళ్ల ప్రమాదాన్ని ఖండిస్తూ మృతి చెందిన వారి ఆత్మలకు భగవంతుడు శాంతి చేకూర్చాలని వారి దక్షిణ మధ్య రైల్వే జోనల్(జడ్ ఆర్ యు సి సి సభ్యుడు) యరగాని నాగన్న గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ మునుముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైల్వే శాఖకు ప్రజలు,ప్రజాప్రతినిధులు సూచిస్తున్న  సలహాలను వెంటనే అమలు చేయాలని కోరారు.సిగ్నలింగ్ వ్యవస్థను పెంచాలని, అదేవిధంగా దేశంలో ఖాళీగా ఉన్న మూడు లక్షల సేఫ్టీ ఉద్యోగాలను వెంటనే నియామకం చేసిన ఎడల ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారించవచ్చని నాగన్న తెలిపినారు. మృతుల కుటుంబాలకు ఎక్స్రేషియా విషయంలో ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాచిమంచి గిరిబాబు, సమ్మేట సుబ్బరాజు,జక్కుల మల్లయ్య, మాజీ కౌన్సిలర్స్ చింతకాయల రాము, పల్లపు దాసు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,కస్తాల సైదులు,రాములు,పెద్దబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

Operation TS: ఇప్పుడు ఇక తెలంగాణ లో ‘‘రాజన్న రాజ్యం’’

Satyam NEWS

హన్మకొండ అనాథ ఆశ్రమంలో దీపావళి సంబరం

Satyam NEWS

ఫైండింగ్:ఆ రెండు శవాలు పెద్దపల్లి ఎమ్మెల్యే బందువులవే

Satyam NEWS

Leave a Comment