అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, మాజీ సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డా|| కె.అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని ఆనంద నిలయం అనాధ ఆశ్రమం, సృ౦దన మనో వికాసం కేంద్రంలో దీపావళి పండుగ జరిగింది. అక్కడి పిల్లలతో దీపావళి టపాసులు కాల్పించి దీపావళి వేడుకలను ఆమె ప్రారంభించారు. పిల్లలకు దీపావళి టపాసులు అందించడమే కాక వారితో సంబురాలు జరిపించడం జరిగింది.
ఈ సందర్భంగా డా|| కె.అనితారెడ్డి మాట్లాడుతూ పండుగ అంటేనే మనం సంతోషంగా ఉండడం కాదని పది మందిని సంతోషపెట్టడం అని అన్నారు. మానసిక దివ్యాంగులు, బధిరుల, అనాధ పిల్లలతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ రెండు రోజులు పిల్లల సంతోషం టపాసులు కాల్చుకోవాలని ముందుగానే వీరికి టపాకాయలు ఏర్పాటు చేసానని తెలిపారు. మానవ సేవ మాధవ సేవ అని ,దివ్యాంగుల, అనాథల సేవ దైవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుచరిత, కళ్యాన్, సుజాత, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.