రైతులందరికి తక్షణమే రుణమాఫీ చేయాలని నిర్మల్ జిల్లా బిజెపి డిమాండ్ చేసింది. రైతుబందు పథకానికి సంబంధించి 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి 10 ఎకరాల లోపు రైతులకు ఖరీఫ్ కి సంబంధించి డబ్బులను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలలో వెంటనే జమ చేయాలని కూడా బిజెపి కోరింది.
ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ కు బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రామ్ నాథ్, ఒడిసెల శ్రీనివాస్, సామ రాజేశ్వర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, అయ్యన్న గారి రాజేందర్ నిర్మల్ టౌన్ అధ్యక్షులు పాల్గొన్నారు.