బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మునుగోడులో ఓటు హక్కు లేదు.ఆయన ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు.అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటు హక్కులేదనే అంశం చర్చనీయాంశంగా మారింది.ఆయనకు నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ఓటు హక్కు ఉంది.ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన అక్కడే ఓటు వేయాలి. అక్కడి నుంచి మునుగోడు నియోజకవర్గానికి ఆయన ఓటు హక్కును మార్చుకోలేదు.దీంతో ఆయన తనకు తాను ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు.ప్రతిష్టాత్మక ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు హక్కు లేకపోవడం ఆసక్తికరంగా మారింది
previous post