29.7 C
Hyderabad
May 4, 2024 04: 08 AM
Slider విజయనగరం

కోర్ట్ లో కేసు ఉండగా అరెస్ట్ అన్యాయం

#ashokgajapatiraju

ఈ ప్రభుత్వం లో పని చేస్తున్న అధికారులపై నమ్మకం లేకనే…రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చారు…టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు.మాజీమంత్రి అయ్యన పాత్రుడు కుటుంబం పై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది…ఆరోపిస్తున్నారు టీడీపీ శ్రేణులు.. విజయనగరం లో బాలాజీ జంక్షన్ వద్ద అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి..ఆందోళన చేపట్టారు. సీఎం కబడ్ధార్… అరచాకం సృష్ఠిస్తాం…మాజీమంత్రి ని తక్షణమే విడుదల చెయ్యాలంటూ ధర్నా కు దిగారు..

అదీ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో. అంతకు ముందు.. పార్టీ ఆఫీసు అయిన అశోక్ బంగ్లాలో అశోక్ గజపతిరాజు మీడియా తో మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను అధికారులు కాలరాస్తున్పారని ఆరోపించారు. మాజీమంత్రి అయ్యన్న విషయంలో కోర్ట్ చూసుకుంటోందని…దాన్నే ధిక్కరించి..తెల్లవారుజామున అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కు ఎంత మొరపెట్టు కున్న..అందులో పని చేసే అధికారులు వినే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. అందుకోసమే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు వినతిపత్రం ఇవ్వాలని తామంతా నిర్ణయించుకున్నామన్నారు.దీంతో అక్కడికే వెళ్లి ఆయనకే వినతిపత్రం ఇస్తామని అన్నారు… కేంద్ర మాజీ మంత్రి.. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు.

Related posts

మహనీయులు నడియాడిన నగరంలో శ్లీ ప్లవ నామ వేడుకలు

Satyam NEWS

బ్లాక్​ ఫంగస్​తో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇద్దరు మృతి

Satyam NEWS

దారుణం జరిగిన 4 రోజుల్లో మిగిలిన నిందితులు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment