38.2 C
Hyderabad
May 2, 2024 22: 54 PM
Slider ఖమ్మం

దేశ శ్రేయస్సు కోసం పాటుపడిన మహానీయుడు రాజీవ్ గాంధీ

#Rajiv Gandhi

భారతదేశ శ్రేయస్సు కోసం పాటుపడిన మహానీయుడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొనియాడారు. కూసుమంచి మండలంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కేక్ కటింగ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశ ప్రజలకోసం దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారన్నారు.

నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే కుటుంబం గాంధీ కుటుంబం అని పేర్కొన్నారు. అనంతరం కూసుమంచి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గద్దెను ఆ పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి,

రామసహాయం మాధవి రెడ్డి, చరణ్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, జెడ్పీటీసీ బెల్లం శ్రీను, యడవల్లి రాం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గురవయ్య, బజ్జూరి వెంకట రెడ్డి, వాసు, వేణు, హాఫీజ్, సత్యనారాయణ, వీరా రెడ్డి, మధుసూదన్, ఇందుర్తి వెంకట రెడ్డి, సైదా, చందర్, వాసు, మంతా, సత్యం, రమేష్ రెడ్డి, బీష్మాచారి తదితరులున్నారు.

Related posts

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో భారీ యాక్షన్ చిత్రం

Satyam NEWS

తల్లి పాలు బిడ్డకు అమృతం తుల్యం: డాక్టర్ వనజ

Satyam NEWS

వరుణ్ తేజ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులు

Satyam NEWS

Leave a Comment