అంబర్ పేట్ నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి రాఖీ కట్టి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
టీ.అర్.ఎస్. సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అంబర్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అద్యక్షుడు యం.సిద్దార్ధ ముదిరాజ్ ఆద్వర్యంలో మహిళలు సీ.ఎం. కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి రాఖీ పండుగ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అంబర్ పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్ అంబర్ పేట్ కార్పోరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టీ.ఆర్.ఎస్. నాయకులు, మహిళా నాయకురాళ్ళు, మైనారిటి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాచిగూడ డివిజన్ కు చెందిన పలువురు బ్రహ్మ కుమారీస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.