ఆధ్వర్యంలో ప్రపంచ తొలి బహుజన విప్లవ వీరుడు సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హల్ లో ఆవిష్కరించారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్ష్య,ప్రధాన కార్యదర్శి జెనిగల శ్రీనివాస్ గౌడ్,తండు వెంకన్న గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రభుత్వం ద్వార కొత్త లైసెన్స్ లు,గౌడ కులస్తులకు రాయితో కూడిన లోన్స్,నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం,గౌడ కులస్తులకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పథకాలను,ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి మన గౌడ్ కులస్తులకు న్యాయం జరిగే వరకు సంఘం తరఫున పోరాడతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చీకూరి లీలావతి గౌడ్,ముఖ్య అతిథి మట్టపల్లి గౌడ అన్నదాన సత్రం చైర్మన్ దొంతగాని రాములు గౌడ్,గౌరవ సలహాదారులు పండ్ల హుస్సేన్ గౌడ్,వల్లపు దాసు కృష్ణ గౌడ్,ఎలక సోమయ్య గౌడ్, నేలపట్ల అంజయ్య గౌడ్,తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ సత్యం న్యూస్