సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హబ్సిగూడ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి శాలువతో సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహన కలిగించి, కార్యసాధకులుగా తీర్చిదిద్దటంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు గరిక సుధాకర్, డాక్టర్ బి.వి చారి, పెంటారెడ్డి, చంద్ర మౌళి, నంది కంటి శివ , కొంగల శ్రీధర్, జె సి బి రాజు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా